ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అశ్వాపురం మండల అభివృద్ధికి రూ. 95 లక్షల నిధులు – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు హృదయపూర్వక ధన్యవాదాలు

అశ్వాపురం మండల అభివృద్ధికి రూ. 95 లక్షల నిధులు – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు హృదయపూర్వక ధన్యవాదాలు
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండలానికి అభివృద్ధి పనుల కోసం రూ. 95 లక్షల నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు మండల ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

2023-24 ఎస్డిఎఫ్ నిధుల కింద రాష్ట్ర ప్రజాప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ. 10 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా:

పాఠశాలలు, కళాశాలల మౌలిక సదుపాయాల కోసం – రూ. 2 కోట్లు

తాగునీటి అవసరాల కోసం – రూ. 1 కోటి

ప్రభుత్వ పరిపాలన కార్యాలయాల నిర్వహణ కోసం – రూ. 50 లక్షలు

మిగతా మొత్తం: గ్రామాలలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనుల కోసం వినియోగించబడుతుంది.

ఈ నిధుల కింద అశ్వాపురం మండలానికి ప్రత్యేకంగా రూ. 95 లక్షలు కేటాయించడమే నాయకుడు ప్రజల సంక్షేమం కోసం ఎంత కట్టుబాటుతో ఉన్నాడో స్పష్టం చేస్తుంది.

నిరంతరం ప్రజల పక్షాన నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్న నాయకుడికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

– తూము వీర రాఘవులు
అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ
ప్రధాన కార్యదర్శి

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్