పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు పొందిన సీఐ శివప్రసాద్కి అభినందనలు తెలిపిన భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్ : అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు అందుకున్న సీఐ శివప్రసాద్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించాడు.
శివప్రసాద్ గతంలో ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్నాడు. విధిలో చూపిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా కేంద్ర హోంశాఖ ఈ గౌరవాన్ని ప్రకటించింది.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ – “ఇది పోలీసు శాఖకు గర్వకారణం. శివప్రసాద్ చేసిన సేవలు, చూపిన సాహసం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి” అని వ్యాఖ్యానించాడు.
Post Views: 124









