వి.ఎం. బంజరలో ఘోర రోడ్డు ప్రమాదం – మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి
పెనుబల్లి,ఆధాబ్ న్యూస్:
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వి.ఎం. బంజర వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా పంచాయతీ కార్యదర్శి బానోత్ సోనాలి (28) మృతిచెందింది.
సోనాలి, రామచంద్రరావు బంజర గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తూ, విధులకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ఆమె మరణించింది.
ఈ వార్త స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. సోనాలి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
Post Views: 139









