ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సుకుమాలో మావోయిస్టుల దాడి: ఎఎస్పీ ఆకాశవరావు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

సుకుమాలో మావోయిస్టుల దాడి: ఎఎస్పీ ఆకాశవరావు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.                       ఛత్తీస్గఢ్, ఆధాబ్ న్యూస్: డిస్క్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతమైన ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మరోసారి మావోయిస్టులు హింసా ప్రవర్తనకు పాల్పడ్డారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్‌)తో పేల్చడంతో ఘోర ప్రమాదం జరిగింది.

ఈ దాడిలో ఎఎస్పీ ఆకాశవరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుంట డీఎస్పీ మరియు సీఐలకు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మావోయిస్టుల ఈ దాడిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అదనపు బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!