ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తురుబాక బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.70 కోట్లు మంజూరు – సీఎం రేవంత్ రెడ్డి కి భద్రాచలం కాంగ్రెస్ నాయకుల ధన్యవాదాలు

తురుబాక బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.70 కోట్లు మంజూరు – సీఎం రేవంత్ రెడ్డి కి భద్రాచలం కాంగ్రెస్ నాయకుల ధన్యవాదాలు
భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
భద్రాచలం మండలంలోని తురుబాక బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.70 కోట్ల నిధులను మంజూరు చేసింది. అలాగే కూనవరం రోడ్ లోని కరకట్ట మరియు నేషనల్ హైవే నిర్మాణ పనుల కోసం నిధులు విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు నియోజకవర్గ ప్రజల తరఫున మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, అరికెల తిరుపతిరావు, పెద్దినేని శ్రీనివాస్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, తాళ్ళ రవి, చుక్కా సుధాకర్, చెగోండి శ్రీనివాస్, ఎండి జిందా, పుల్లగిరి నాగేంద్ర, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గాడి విజయ్, మండల అధ్యక్షులు ఆకుల వెంకట్, కార్యదర్శి మాచినేని భాను, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ప్రాధాన్యతలకు ప్రాముఖ్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!