30 క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అశ్వాపురం సీఐ అశోక్
అశ్వాపురం, ఆధాబ్ న్యూస్:
బూర్గంపాడు మండలం నుండి అశ్వాపురం వైపు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీతారాంపురం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో, సీఐ అశోక్ నేతృత్వంలో పోలీసులు ఒక బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
తనిఖీ చేస్తే అందులో సుమారు 30 క్వింటాల రేషన్ సన్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకొని, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు
Post Views: 35









