హనుమాన్ జయంతి సందర్భంగా మణుగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పోలీసు అధికారులు.
మణుగూరు ,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నేడు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మణుగూరు పోలీసు శాఖ అధికారులు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇంచార్జ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మేడాప్రసాద్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అధికారులతో పాటు పలువురు పోలీసు సిబ్బంది కూడా ఈ సందర్భంగా పాల్గొన్నారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని వారు భక్తులకు సూచించారు.
Post Views: 129









