సత్తుపల్లిలో విషాదం: తెగిపడిన విద్యుత్ వైర్లు బలిగొన్న రైతు
సత్తుపల్లి, ఆధాబ్ న్యూస్:
సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పొలాల్లో తెగిపడి ఉన్న 11 కేవీ హై వోల్టేజ్ విద్యుత్ వైర్లు మోటార్ సైకిల్కు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన పైడిమర్ల పెద్ద మురళీధర్ రెడ్డి (59) విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
వైర్లు తగలడంతో మోటార్ సైకిల్ పూర్తిగా కాలిపోయింది. మురళీధర్ రెడ్డి శరీరం కాలిపోయింది ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని మేళూర్చింది.
Post Views: 98









