సిద్ది సునీల్ కరకగూడెం మండల BRS సోషల్ మీడియా అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల BRS పార్టీ సోషల్ మీడియా శాఖకు అధ్యక్షుడిగా సిద్ది సునీల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ, “సునీల్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా పనిచేయాలి. అధికారపక్షం అబద్దాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది” అన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాలను బలోపేతం చేయడంలో సునీల్ పాత్ర కీలకమవుతుందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మండల స్థాయిలో కార్యకర్తల మద్దతును పొందుతూ పార్టీకి మరిన్ని సేవలు అందించాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Post Views: 261









