ఎట్టి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం. కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, బండారిగుంపు గ్రామానికి చెందిన ఎట్టి నర్సయ్య, సుగుణకాంతమ్మ దంపతుల కుమారుడు పురుషోత్తం వివాహ వేడుకలో పాల్గొన్నారు.
పురుషోత్తం చంద్రకళను , ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు నూతన వధువరులను ఆశీర్వదించి అక్షింతలు వేసి, నూతన వస్త్రాలను బహూకరించాడు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచ్ పోలెబోయిన తిరుపతయ్య, యర్ర సురేష్, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 34









