అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ వినతి
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇండిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ తహసిల్దార్ కార్యాలయాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రంలో పలు సమస్యలతో కూడిన అంశాలు పేర్కొంటూ, పేద ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు పథకం నిజంగా గరిష్ఠంగా పేదల అవసరాలను తీర్చే విధంగా ఉండాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.
Post Views: 28









