ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణలో హై అలర్ట్: ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష

తెలంగాణలో హై అలర్ట్: ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్: భారత భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతా అంశాలపై అధికారులతో సమీక్ష చేసి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సీఎం కీలక ఆదేశాలు:
రాష్ట్ర ప్రజలకు సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు.
వైద్య, విద్యుత్, పారిశుధ్య, అత్యవసర సేవల విభాగాలు 24 గంటలు అందుబాటులో ఉండాలి.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను బలోపేతం చేయాలని సూచన.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై చర్యలు; రెచ్చగొట్టే పోస్టులపై కేసులు నమోదు చేయాలి.

శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలకు వెంటనే స్పందించాలి.
ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి.

హైదరాబాద్ నగరానికి ప్రత్యేక జాగ్రత్తలు:
పోలీసుల రెగ్యులర్ మోవ్‌మెంట్ పెంచాలి.
పీస్ కమిటీలు, పోలీసు శక్తులు సమన్వయంతో పనిచేయాలి.

రాజధానిలో కఠిన భద్రత:
మూడవ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల నిఘా మరింత మెరుగుపరచాలి.

జిల్లా కేంద్రాల్లో పోలీసు బలగాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.

ప్రభుత్వ లక్ష్యం – ప్రజల భద్రత:

ఈ సమావేశంలో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర అత్యవసర విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యమని సీఎం స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్