తెలంగాణలో హై అలర్ట్: ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్: భారత భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతా అంశాలపై అధికారులతో సమీక్ష చేసి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సీఎం కీలక ఆదేశాలు:
రాష్ట్ర ప్రజలకు సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు.
వైద్య, విద్యుత్, పారిశుధ్య, అత్యవసర సేవల విభాగాలు 24 గంటలు అందుబాటులో ఉండాలి.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను బలోపేతం చేయాలని సూచన.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై చర్యలు; రెచ్చగొట్టే పోస్టులపై కేసులు నమోదు చేయాలి.
శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలకు వెంటనే స్పందించాలి.
ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి.
హైదరాబాద్ నగరానికి ప్రత్యేక జాగ్రత్తలు:
పోలీసుల రెగ్యులర్ మోవ్మెంట్ పెంచాలి.
పీస్ కమిటీలు, పోలీసు శక్తులు సమన్వయంతో పనిచేయాలి.
రాజధానిలో కఠిన భద్రత:
మూడవ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల నిఘా మరింత మెరుగుపరచాలి.
జిల్లా కేంద్రాల్లో పోలీసు బలగాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి.
ప్రభుత్వ లక్ష్యం – ప్రజల భద్రత:
ఈ సమావేశంలో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర అత్యవసర విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యమని సీఎం స్పష్టం చేశారు.









