అడవి దున్న దాడిలో తునికాకు మహిళా కూలీకి తీవ్ర గాయాలు
గంగారం,ఆధాబ్ న్యూస్:
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మామిడిగూడెం గ్రామానికి చెందిన తునికాకు మహిళా కూలీ జనగం సృజనపై అడవిలో దుండగ దాడి జరిగింది. తునికాకు సేకరణ కోసం సృజన మామిడిగూడెం సమీపంలోని అడవిలోకి వెళ్లిన సమయంలో, ఒక్కసారిగా అడవి దున్న దాడికి పాల్పడింది.
ఈ దాడిలో సృజనకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను వెంటనే సహకారంతో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
పరిస్థితిని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. స్థానికులు అడవిలో తునికాకు సేకరణకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Post Views: 27









