బూర్గంపాడు, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి ఆహ్వానంపై పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు శనివారం వారి స్వగృహంలో నిర్వహించిన తేనేటి విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ నాయకులతో పలు ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 30









