ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎసిబి వలకు చిక్కిన ఎక్సైజ్‌ సీనియర్‌ అసిస్టెంట్‌.

ఎసిబి వలకు చిక్కిన ఎక్సైజ్‌ సీనియర్‌ అసిస్టెంట్‌.
ఆధాబ్ న్యూస్, వికారాబాద్‌:
వికారాబాద్‌లో ఎక్సైజ్‌ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీధర్‌ అనే సీనియర్‌ అసిస్టెంట్‌ ఒక అధికారికి సంబంధించిన డీఏ బిల్లును ప్రాసెస్‌ చేయడానికి రూ.8 వేల లంచం డిమాండ్‌ చేశాడు.

లబ్ధిదారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, శుక్రవారం ఏసీబీ అధికారులు శ్రీధర్‌ను లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం రూ.76 వేల డీఏ బిల్లులో నుంచి ఇవ్వబోయే రూ.8 వేల లంచాన్ని తీసుకుంటుండగా, ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్