ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రివ్యూ సమావేశం

వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రివ్యూ సమావేశం

మణుగూరు,ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ADA తాతారావు PACS చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి , మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
వర్షాకాలం కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలి
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండటానికి అవసరమైన చర్యలపై ఈ సమావేశంలో చర్చించబడింది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రభుత్వ పథకాలపై సమీక్ష
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, సన్న బియ్యానికి రూ.500 బోనస్, నష్టపరిహారం వంటి పథకాలు రైతులకు చేరే విధానాలపై చర్చ జరిగింది. పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
రైతులకు మెరుగైన సేవలే ప్రధాన లక్ష్యం
రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందించే సేవలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని, వారి సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతులు మరియు వ్యవసాయ అధికారుల మధ్య మానవీయ సంబంధాలు బలపడాలని అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!