ప్రతి క్షణం
ప్రజల పక్షం

  యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం: 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది

ఆధాబ్ న్యూస్ ,నల్గొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం పవర్‌ ప్లాంట్‌ యొక్క మొదటి యూనిట్‌లోని బాయిలర్ నుంచి ఆయిల్‌ లీక్‌ అవడంతో ఆ సమయంలో కింద వెల్డింగ్‌ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు మొత్తం యూనిట్‌ వరకు వ్యాపించడంతో భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం కారణంగా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్‌ రన్‌ ప్రారంభానికి సిద్ధమైనప్పుడు ఈ ప్రమాదం జరిగింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!