మారకద్రవ్యాల నిర్మూలనలో ప్రతిభ చూపిన ఎస్ఐ రాజ్ కుమార్కు గౌరవ డీజీపీ చేతుల మీదుగా రివార్డు
పినపాక,ఆధాబ్ న్యూస్:
మారకద్రవ్యాల నిర్మూలనలో విశేష కృషి చేసిన బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజ్ కుమార్కు గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ జితేందర్ ఆయనకు ప్రత్యేక రివార్డు అందజేశారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ గౌరవ కార్యక్రమం జరిగింది. రాజ్ కుమార్ మారకద్రవ్యాల నిర్మూలనలో చూపిన నిబద్ధత, కృషికి గుర్తింపుగా ఈ రివార్డు అందుకున్నారు. కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, అధికారులు హాజరయ్యారు. అధికారులు రాజ్ కుమార్ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. డ్రగ్స్ నిర్మూలనలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. యువతను రక్షించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
Post Views: 140









