వధూవరులను ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామవరం గ్రామంలో జరిగిన వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తాటి కొండమ్మ, (లేటు) రాములు దంపతుల కుమారుడు మధు, చందన దంపతుల వివాహ రిసెప్షన్ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 37









