ములుగు కలెక్టరేట్లో మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష
ఆధాబ్ న్యూస్, ములుగు, ఏప్రిల్ 23:
మేడారం 2026 జాతర నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తాగునీరు, వైద్యం, రవాణా, శౌచాలయాల ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష జరిగింది. ప్రతి శాఖ తమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు.
Post Views: 34









