ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు

7 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం
ఆధాబ్ న్యూస్,మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మరో ముందడుగు వేసింది. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ప్రత్యేక చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రిలో 7 మంది నూతన స్పెషలిస్ట్ వైద్యులను నియమించారు.

ఇప్పటివరకు ఉన్న 6 మంది వైద్యులతో పాటు తాజా నియామకాలతో మొత్తం 13 మంది వైద్యులు ప్రజలకు అందుబాటులోకి రానున్నారు. ఈ మేరకు గైనకాలజిస్ట్, అనస్థీషియాలజిస్ట్, పిల్లల వైద్యుడు, జనరల్ ఫిజీషియన్, స్కానింగ్ వైద్యులు నియమితులయ్యారు.

నూతనంగా నియమితులైన వైద్యులు:

గైనకాలజిస్ట్: 2

అనస్థీషియాలజిస్ట్: 2

పిల్లల వైద్యుడు: 1

జనరల్ ఫిజీషియన్: 1

రేడియోలజిస్ట్: 1

గతంలో అందుబాటులో ఉన్న వైద్యులు:

MBBS వైద్యులు: 5

డెంటల్ వైద్యుడు (BDS): 1

మొత్తం వైద్యులు: 13

ఈ కొత్త నియామకంతో మణుగూరు ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి. ప్రసూతి సేవలు, అత్యవసర చికిత్సలు, శస్త్రచికిత్సల సమయంలో అనస్థీషియా సేవలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ, జనరల్ మెడిసిన్ మరియు స్కానింగ్ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించనుంది. అవసరమైన ఆరోగ్యసేవలను అందించేందుకు ప్రభుత్వం దశల వారీగా చర్యలు చేపడుతుండటం అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్