సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్.
పినపాక , ఆధాబ్ న్యూస్:
పినపాక మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్ను సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిట్టా వెంకటేశ్వర్లు ఎంపీడీవో సునీల్ కుమార్కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సునీల్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తానని, ఎవరైనా ఏ సమస్య ఉన్నా తమను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిపాలనా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు కొంపెల్లి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షుడు యాకన్నా, ప్రధాన కార్యదర్శి గుడికందుల రాజశేఖర్, ట్రెజరర్ గుమాస్ వెంకటేశ్వర్లు, సభ్యులు కొంపెల్లి నాగేష్, దొడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









