పినపాక ఆధాబ్ న్యూస్ : పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కప్ 2024-25 క్రికెట్ టోర్నమెంట్ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఎమ్మెల్యే క్రికెట్ ఆడి, రెండు టీములకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.టోర్నమెంట్ నిర్వహించిన ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే, క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భద్రాచలం మండలానికి చెందిన గొంగడి త్రిష మహిళా అండర్-19 T20 వరల్డ్ కప్లో సెంచరీ సాధించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. గోపాలపురం గ్రౌండ్ అభివృద్ధికి జిల్లా కలెక్టర్తో చర్చించి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Post Views: 56









