-సంక్రాంతి పేరుతో కోడి పందెం ఆడితే కఠిన చర్యలు.
_ఇ.బయ్యారం ఎస్సై రాజ్ కుమార్
– పినపాక , ఆధాబ్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూల్ల బయ్యారం ఎస్సై ఇ. రాజ్ కుమార్ సోమవారం పినపాక మండల ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన కోడి పందెం లను ఉద్దేశించి మాట్లాడుతూ మండల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కోడిపందాలు ఆడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పందెపు రాయుళ్లను ప్రత్యేకమైన ఫోర్స్ తో పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.పేకాట కోడిపందాలు ఎవరైనా ఆడుతున్నట్లయితే తమకు సమాచారం తెలియజేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్.ఐ రాజ్ కుమార్ అన్నారు.
Post Views: 90









