ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం.

ఆధాబ్ న్యూస్, కరకగూడెం : కరకగూడెం మండల పరిధిలోని 20 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద లబ్ధిదారులకు రూ.6,50,000ల‌ విలువ చేసే చెక్కులను పంపిణీ చేసిన పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగప్రసాద్, ఎంపీ ఓ కుమార్, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్, పోలబోయిన తిరుపతయ్య. మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి. చందా వెంకటరత్నమ్మ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!