ప్రారంభోత్సవానికి సిద్ధమైన నూతన పోలీస్ స్టేషన్ను పరిశీలించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి
ఆధాబ్ న్యూస్ ,మణుగూరు:
మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ రవీందర్ రెడ్డి సోమవారం పోలీస్ స్టేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. త్వరలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ సి.వి. ఆనంద్ చేతుల మీదుగా ఈ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో జరుగుతున్న తుది ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సౌకర్యాలను డీఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ పరిశీలనలో మణుగూరు సీఐ నాగబాబు, బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నగేష్ కుమార్, ఎస్సై సతీష్, ఎస్సై రవుఫ్, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6








