ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు

ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు

మణుగూరు, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మణుగూరు కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదేశాల మేరకు డాక్టర్ రామదాసు ఆధ్వర్యంలో అమూల్య డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రమోద్ డెంటల్ ఆసుపత్రి, సుశ్రుత హాస్పిటల్, నాగార్జున డెంటల్, సింగరేణి ఏరియా ఆసుపత్రులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సంబంధిత ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల అనుమతులు, రికార్డులు, వైద్య సేవల నిర్వహణపై పరిశీలన చేపట్టారు. అనుమతులు లేకుండా ఆసుపత్రులు లేదా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. తనిఖీలకు సంబంధించిన నివేదికను జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారికి సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరీష్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ బేబీ, జూనియర్ అసిస్టెంట్లు శ్రీధర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….