ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జూలూరుపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన

జూలూరుపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన

జూలూరుపాడు,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటించారు. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడి శిబిరం నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం దొండమిట్ట తండా ప్రాథమిక పాఠశాలలో రూ.2 లక్షల నిధులతో నిర్మించనున్న బాలుర మరుగుదొడ్డి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పాపకొల్లు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో రూ.1.10 లక్షల నిధులతో నిర్మించనున్న ఇంకుడు గుంత పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ తెలిపారు. అధికారులు పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్