ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్

రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్

తెలంగాణ,ఆధాబ్ న్యూస్:

తెలంగాణలో అవినీతి అధికారులపై మరోసారి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దాడులు కొనసాగుతున్నాయి. బోరబండ GHMC కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీలత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది.

ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేయడానికి బాధితుడి నుంచి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన శ్రీలత, అందులో భాగంగా రూ.1 లక్ష తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపట్టి అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలన కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్