రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్
తెలంగాణ,ఆధాబ్ న్యూస్:
తెలంగాణలో అవినీతి అధికారులపై మరోసారి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దాడులు కొనసాగుతున్నాయి. బోరబండ GHMC కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీలత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడింది.
ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేయడానికి బాధితుడి నుంచి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన శ్రీలత, అందులో భాగంగా రూ.1 లక్ష తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపట్టి అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలన కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు.
Post Views: 20









