ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  రైతులపై కాంగ్రెస్ పార్టీ వివక్షత: రావుల సోమయ్య ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి – BRS డిమాండ్

రైతులపై కాంగ్రెస్ పార్టీ వివక్షత: రావుల సోమయ్య

ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి – BRS డిమాండ్

కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని BRS పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య డిమాండ్ చేశారు.

ఆదివారం కరకగూడెం BRS పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో BRS ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.10,000 రైతుబంధు, రూ.5 లక్షల రైతుభీమా, 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ వంటి పథకాలను అమలు చేసిందని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా రైతుబంధు నిధులను ఆలస్యం చేస్తోందని, రైతు బోనస్ ఇవ్వడం లేదని, అలాగే ఒడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కౌలు రైతులకు రూ.12,000 ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కూడా రైతులను మోసం చేయడమేనన్నారు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు రైతుల సమస్యలను పట్టించుకోకుండా కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని, లేదంటే రైతుల తరఫున ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులకు BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ ఉపాధ్యక్షులు పోగు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బుడగం రాము, మాజీ సర్పంచ్ ఊకె రామనాధం, బైరిశెట్టి చిరంజీవి, ఏళ్ళు రామకృష్ణ రెడ్డి, రావుల కనకయ్య, పాయం నరసింహారావు, కొమరం విశ్వనాథం, చందా పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….