ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కాంగ్రెస్ పాలనపై ప్రజలకు నమ్మకం కోల్పోయింది: రావుల సోమయ్య

కరకగూడెం ,ఆధాబ్ న్యూస్:
గజ్వేల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

నిన్న గజ్వేల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు పాశవికంగా దాడి చేశారని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోం శాఖను తన దగ్గర ఉంచుకుని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.

ప్రజా పాలన పేరుతో రాష్ట్రాన్ని గుండాల రాజ్యంగా మార్చారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. గుండాయిజాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేస్తున్నారని ఆరోపించారు.

ఈ సమావేశంలో మండల నాయకులు బుడగం రాము, కొమరం రాంబాబు, రేగా సత్యనారాయణ, కొమరం సత్యనారాయణ, పాయం కృష్ణ, అత్తె ముకుందరావు, అత్తె సత్యనారాయణ, చెన్నోజు రాజేశ్వరరావు, పసునూరి అంజయ్య, మొగిలిపువ్వు వెంకన్న, అత్తె రమేష్, నిట్ట ఏడుకొండలు, గోగ్గలి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్