కరకగూడెంలో ఆకస్మిక వాహన తనిఖీలు.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం ప్రధాన రహదారి కూడలి వద్ద ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరావు ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు ఇతర అవసరమైన పత్రాలను పరిశీలించారు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించిన సీఐ, నిబంధనలు అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
Post Views: 76









