ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  మానవత్వం చాటుకున్న కరకగూడెం ఎస్సై పీవీ నాగేశ్వరరావు

మానవత్వం చాటుకున్న ఎస్సై పీవీ నాగేశ్వరరావు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:

కరకగూడెం మండలంలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కరకగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై పీవీ నాగేశ్వరరావు నిలిచారు. మండలంలోని వట్టంవారి గుంపు గ్రామపంచాయతీ పరిధిలో నివసిస్తున్న ఓర్సు మల్లయ్య (సుమారు 75 సంవత్సరాలు) గత కొన్ని నెలలుగా భార్య మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై మానసిక స్థితి కోల్పోయి గ్రామంలో నిరాశ్రయుడిలా తిరుగుతూ దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నాడు.

ఈ విషయాన్ని గమనించిన ఎస్సై నాగేశ్వరరావు వెంటనే స్పందించి, మల్లయ్యను తన వద్దకు తీసుకువచ్చి కటింగ్, షేవింగ్ చేయించి శుభ్రపరిచారు. అనంతరం అతనికి కొత్త దుస్తులు అందజేసి, పౌష్టికాహారం కూడా అందించారు. అంతేకాకుండా అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన సహాయం అందించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ఎస్సై నాగేశ్వరరావు చేసిన సేవను అభినందిస్తూ, పోలీస్ శాఖలో ఇలాంటి సేవాభావం కలిగిన అధికారులు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. మానవత్వంతో చేసిన ఈ చర్య సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఎస్సై నాగేశ్వరరావుపై ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….