నాగర్ కర్నూల్ మార్చి 30 (ఆధాబ్ న్యూస్):
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీ వదిలివ్వడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ వేసి అతడిని పట్టుకున్నారు.
ఈ ఘటనతో అంబేద్కర్ చౌరస్తాలో బాధితులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుతూ “అవినీతి ఎస్సై డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.
అతను పలువురిని డబ్బులకు వేధించాడని, సీసీ కెమెరాల పేరుతో గ్రామాల్లో వసూళ్లు చేశాడని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని డబ్బులు దండుకున్నాడని బాధితులు ఆరోపించారు.
Post Views: 19









