భద్రాచలానికి గవర్నర్ రాక – ఘన స్వాగతం
సారపాక ఐటిసి హెలిప్యాడ్ వద్ద ఆతిథ్యం – మంత్రులు, అధికారులు హాజరు
బూర్గంపహాడ్, మార్చి 28 ఆధాబ్ న్యూస్:
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల శనివారం భద్రాచలం విచ్చేశారు. సారపాకలోని ఐటిసి హెలిప్యాడ్ వద్ద గవర్నర్కు ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులు గవర్నర్కు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు.
అనంతరం గవర్నర్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చేరుకుని పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా భద్రాచలంలో భక్తుల రద్దీ నెలకొంది.









