🛕 శ్రీ సీతారాముల దేవస్థానంలో ప్రత్యేక లైటింగ్తో భక్తి వెలుగులు
కరకగూడెం (ఆధాబ్ న్యూస్): భక్తి భావానికి ప్రతీకగా కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ సీతారాముల వారి దేవస్థానంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు. రానున్న శ్రీరామనవమి (శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం) సందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు చేపట్టారు.
గ్రామ సర్పంచ్ పోలేబోయిన సుజాత, ఉప సర్పంచ్ బుడగం రాము, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను శుభ్రం చేయించి, గుడి అలంకరణ కోసం నూతన లైట్లను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని,
శ్రీరామనవమి వేడుకలు శాంతి, ఐక్యతతో ఘనంగా జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పెద్దలు జలగం రామచంద్రు, శేఖర్, మురళీ, కృష్ణ, మండల నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రాబోయే పండుగను పురస్కరించుకుని గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.









