ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కొత్త రేషన్ కార్డుదారులకు గృహజ్యోతి వర్తింపజేయాలి అదనపు కలెక్టర్‌కు మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ వినతి

కొత్త రేషన్ కార్డుదారులకు గృహజ్యోతి వర్తింపజేయాలి
అదనపు కలెక్టర్‌కు మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ వినతి

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
మణుగూరు మున్సిపాలిటీ మరియు మండల పరిధిలోని కొత్త రేషన్ కార్డుదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులు ఉన్నప్పటికీ చాలామంది లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తించడం లేదని తెలిపారు. ప్రజాపాలనలో ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, సాంకేతిక సమస్యలు మరియు డేటా అప్డేట్ లోపాల కారణంగా అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని క్షేత్రస్థాయిలో తెలిసిందన్నారు.

దీంతో నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కొన్ని సూచనలు చేశారు:

గతంలో దరఖాస్తు చేసి ఆమోదం పొందినవారి వివరాలతో పాటు, కొత్త రేషన్ కార్డుదారుల దరఖాస్తులను ఎంపీడీవో మరియు మున్సిపల్ కార్యాలయాల్లో తిరిగి స్వీకరించేందుకు ఆదేశాలు ఇవ్వాలి.

కొత్తగా వివాహమైన వారు మరియు కొత్త కార్డుదారులు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

దరఖాస్తు చేసుకున్న వెంటనే విద్యుత్ శాఖ డేటాబేస్‌లో వివరాలు అప్డేట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.

ఈ అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని పాల్వంచ దుర్గ విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!