ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  గోదావరిలో విషాదం… స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు ప్రవాహానికి బలి

గోదావరిలో విషాదం… స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు ప్రవాహానికి బలి

భద్రాచలం,మార్చి 20 ఆధాబ్ న్యూస్ :గోదావరి నదిలో స్నానానికి దిగిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోయిన విషాద ఘటన భద్రాచలం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న SRM ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు సెలవుల సందర్భంగా భద్రాచలం పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో భద్రాచలం – కూనవరం రహదారిలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు ప్రాంతానికి వెళ్లి గోదావరి నది అందాలను వీక్షించారు.

అనంతరం వారిలో ఐదుగురు విద్యార్థులు నదిలో స్నానం చేయడానికి దిగగా, నది లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడం, నీటి మట్టం అధికంగా ఉండటం, ప్రవాహ వేగం ఒక్కసారిగా పెరగడంతో వారు నీటిలో మునిగిపోయారు. గట్టుపై ఉన్న మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపగా, విద్యార్థుల కుటుంబాల్లో దుఃఖ ఛాయలు నెలకొన్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….