కూలీలతో వెళ్తున్న ట్రాలీకి లారీ ఢీ – 6 మందికి తీవ్ర గాయాలు
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాలీని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని మణుగూరు మరియు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గాయపడిన కూలీలంతా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటన స్థలంలో 108 ఈఎంటీ శ్రీను వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు.
Post Views: 82









