అడవులకు నిప్పు పెడితే కఠిన చర్యలు
– రేగళ్ళ రేంజర్ జస్వంత్ ప్రసాద్ హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: అడవులకు కావాలనే నిప్పు పెట్టే వారిపై అటవీ హక్కుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రేగళ్ళ రేంజర్ జస్వంత్ ప్రసాద్ హెచ్చరించారు. అడవుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రేగళ్ళలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
అడవుల్లో మంటలు చెలరేగితే అటవీ సంపదతో పాటు జీవజాలం కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి గ్రామస్థులు అప్రమత్తంగా ఉండి అడవుల సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.
అడవుల్లో ఎవరైనా కావాలనే నిప్పు పెడితే అటవీ హక్కుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ చిలకమారి శ్రీనివాసరావు, అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.









