ప్రతి క్షణం
ప్రజల పక్షం

  విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సమావేశం

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సమావేశం

కరకగూడెం ఆధాబ్ న్యూస్: మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, సర్పంచ్ పోలేబోయిన సుజాత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్ ఎన్.వి. వేణుగోపాల్ చారిని శాలువాతో సత్కరించారు. మండలంలో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!