ముత్యాలమ్మ తల్లి దర్శించుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం,మార్చి 10, ఆధాబ్ న్యూస్: భద్రాచలం అశోక్నగర్ కొత్తకాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం మరియు ధ్వజస్తంభం స్థాపన కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ సర్పంచ్ పూనెం కృష్ణ, సీనియర్ నాయకులు బుడగం శ్రీనివాస్, చింతీరల రవికుమార్, మండల నాయకులు, వార్డు సభ్యులు, యువ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 10









