ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు 100 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

మణుగూరు 100 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

మణుగూరు,మార్చి 5, ఆధాబ్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత పరిస్థితులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

ఆసుపత్రిలోని వార్డులు, ఔట్‌పేషంట్ విభాగం, ల్యాబ్, ఫార్మసీ వంటి విభాగాలను సందర్శించిన కలెక్టర్ అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని, రోగులకు సమయానికి వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ సూచనలు చేశారు. అలాగే అవసరమైన మందులు, వైద్య సదుపాయాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

ఈ తనిఖీలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!