ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  కరకగూడెం మండలంలో ఘనంగా బాలా మేళా

కరకగూడెం మండలంలో ఘనంగా బాలా మేళా

కరకగూడెం,మార్చి 2 ఆధాబ్ న్యూస్ :విద్యార్థుల ప్రాథమిక అభ్యాస నైపుణ్యాల అభివృద్ధి, సృజనాత్మక ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా కరకగూడెం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి బాలా మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది.

మండలంలోని వివిధ ప్రాథమిక పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థుల కోసం రాత పరీక్షలు, కథలు చెప్పడం, చదవడం, గణిత నైపుణ్యాల ప్రదర్శనతో పాటు పలు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించబడినవి.

ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి జి మంజుల మాట్లాడుతూ, బాలా మేళా వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. భట్టుపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి మోహన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చూపిన ప్రతిభ ప్రశంసనీయమని, జిల్లా స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

అనంతారం కాంప్లెక్స్ ఇంచార్జ్ వసంత్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలకు దోహదపడతాయని పేర్కొన్నారు.

పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

మండల రిసోర్స్ పర్సన్స్ జె వెంకటేశ్వర్లు, కే సూర్యనారాయణ, భావ్ సింగ్, రమేష్, తిరుమల రావు, కీర్తి వర్ధన్, రఘు, ఉపాధ్యాయులు శ్వేత, సుమతి, లీల ప్రవీణ, విజయనందిని, రమాదేవి, స్వాతి, ఆట యూనియన్ నాయకులు కుమారస్వామి, వినోద్, గిరి, శ్రీనివాస్, అశోక్, సిఆర్పిలు సాంబశివరావు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….