ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ బదిలీ – జితేష్ వి పాటిల్‌కు కొత్త బాధ్యతలు

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ బదిలీ – జితేష్ వి పాటిల్‌కు కొత్త బాధ్యతలు

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలలో భాగంగా కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న జితేష్ వి పాటిల్‌ను బదిలీ చేసింది.

ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న జితేష్ వి పాటిల్‌ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ టీజీ ఎమ్‌పీడీసీఎల్ (TGMPDCL) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలో తన పదవీకాలంలో జితేష్ వి పాటిల్ విద్య, వైద్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. ముఖ్యంగా ఆరోగ్య సేవల మెరుగుదలలో ఆయన ప్రత్యేక కృషి గుర్తింపు పొందింది.

ఇదిలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా నిజామాబాద్‌లో అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న అంకితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కొత్త కలెక్టర్ బాధ్యతలు త్వరలో స్వీకరించే అవకాశం ఉంది. జిల్లాలో పరిపాలన మరింత బలోపేతం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్