ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  మణుగూరులో ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం

మణుగూరులో ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం

మణుగూరు, ఫిబ్రవరి 17 (ఆధాబ్ న్యూస్):
పినపాక నియోజకవర్గం మణుగూరు ప్రజాభవన్‌లో ఆర్డబ్ల్యూఎస్ మరియు మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో చేతి పంపులు, ఓహెచ్ఎస్ (OHS) వ్యవస్థలు పూర్తిగా పనిచేసేలా చూసుకోవాలని ఆదేశించారు.

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయా లేదో పరిశీలించి, ప్రతి ఇంటికి త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

తాగునీటి సరఫరా విషయంలో నిధుల కొరత ఉన్నట్లయితే, ప్రతి మండలం నుంచి నివేదికలు సమర్పించాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేష్, నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, మణుగూరు మున్సిపల్ కమిషనర్, ఏఈలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….