ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: వీధి కుక్కల సమస్యపై రాష్ట్రాలు చర్యలు తప్పనిసరి

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: వీధి కుక్కల సమస్యపై రాష్ట్రాలు చర్యలు తప్పనిసరి

న్యూఢిల్లీ, ఆధాబ్ న్యూస్: దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు సూచనలు ఇలా ఉన్నాయి:

రహదారులు, వీధులపైకి కుక్కలు అలాగే పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఈ సమస్యను నియంత్రించాలి.

డ్రైవ్ అమలు స్థితిగతులపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు కోర్టుకు సమర్పించాలి.

స్కూల్స్, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, ఆస్పత్రులు వంటి కీలక ప్రదేశాల్లో కుక్కలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

వీధి కుక్కల నిర్వహణ పై అమికస్ క్యూరీ నివేదికలో సూచించిన చర్యలను అమలు చేయాలని సూచించింది.

నివేదిక అమలుపై అఫిడవిట్ దాఖలు చేయకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా వీధి కుక్కల సమస్యపై నిర్లక్ష్యం చేయరాదని, సమగ్ర వ్యూహంతో ముందుకు రావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్