ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మానవత్వంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి గుడ్ల రంజిత్ కుమార్

మానవత్వంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి గుడ్ల రంజిత్ కుమార్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్‌గా ప్రజా సేవలో ముందుండే రంజిత్ కుమార్ జీవనాధారంగా ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, నిరుద్యోగుల కష్టాలను స్వయంగా అనుభవించి,
తన చెమటతో కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ సమాజ సేవలో సతతంగా నిమగ్నమవుతున్నాడు.

తన జీవన ప్రయాణం ప్రతి యువకుడికి ప్రేరణ.
పని చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా, కష్టాన్ని గౌరవంగా భావించే రంజిత్ కుమార్
జీవితాన్ని సవాళ్లుగా తీసుకొని వాటిని విజయంగా మార్చుకున్న వ్యక్తి.

తన మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి పరిష్కారం చూపడంలో రంజిత్ కుమార్ ఎప్పుడూ ముందుంటాడు.
ఎవరికి ఏ బహుమతి వచ్చినా, విజయాలు సాధించినా, వారిని సన్మానించడంలో ఆయన స్టైలే వేరు.
ఇతరులను ప్రోత్సహిస్తూ, క్రీడలలో విజయం సాధించిన యువతను సన్మానిస్తూ, ప్రోత్సాహాలు అందిస్తూ
మోటివేషన్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు.

రంజిత్ కుమార్ ఆటో నడిపినా, ఆలోచనలలో నాయకుడు — సేవలో శిఖరం.
అన్ని రంగాల్లో మల్టిపుల్ టాలెంట్‌తో, సమాజంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ఇచ్చే వ్యక్తిత్వం అతనిది.
మానవత్వం, వినయం, కష్టానికి విలువ — ఇవే అతనికి కిరీటాలు, ఇవే అతనికి గౌరవం.

ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే సేవా ధోరణి అరుదైనది.
పదవి గౌరవం కాదు, ప్రజల మద్దతే నిజమైన బలం అని నిరూపించాడు.

మా మండలంలో గుడ్ల రంజిత్ కుమార్ ఉండడం గర్వకారణం.
అతని కృషి, సేవా భావం, మానవత్వం — సమాజానికి వెలుగునిచ్చే దీపంలా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి.

“మా మండలంలో ఇటువంటి స్నేహితుడు ఉండడం మాకు గర్వకారణం” అని ఆయన మిత్రులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్