ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు భారంగా మారిన నేపథ్యంలో ఎంపీఓకు తాళాలు అప్పగింత

గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు భారంగా మారిన నేపథ్యంలో ఎంపీఓకు తాళాల అప్పగింత
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం పరిధిలోని 16 గ్రామ పంచాయతీల కార్యదర్శులు, గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు ఆర్థికంగా భారంగా మారాయని పేర్కొంటూ ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓ మారుతికి అప్పగించారు.
కార్యదర్శులు పేర్కొనడంతో, గత ప్రభుత్వం చెత్త సేకరణ కోసం సరఫరా చేసిన ట్రాక్టర్లు ప్రస్తుతం పెద్ద మొత్తంలో నిర్వహణ ఖర్చును తెచ్చిపెడుతున్నాయని, ఇంధనం, మరమ్మతులు, డ్రైవర్ ఖర్చులతో పంచాయతీలు అప్పుల్లోకి జారుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్ల నిర్వహణ తమ వల్ల కాకపోవడంతో తాళాలను అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.

“పంచాయతీల ఆర్థిక స్థితి దెబ్బతింటోంది. వ్యయభారం భరించలేని స్థితికి వచ్చాం,” అని వారు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా 16 గ్రామ పంచాయతీలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్