పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా రూ. 3.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మణుగూరు,ఆధాబ్,న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 8 మంది లబ్ధిదారులకు రూ. 3.50 లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు. ఈ చెక్కులను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు స్వయంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, అలాగే కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









